పట్టాలు తప్పిన ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌

by సూర్య | Thu, Jan 16, 2020, 09:15 AM

కటక్‌ : ఒడిశాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఉదయం కటక్‌ సమీపంలో ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. ముంబయి నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌ 6 బోగీలు నిర్గుండి వద్ద పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 50 మందికిపైగా గాయపడగా.. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను కటక్‌లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM