by సూర్య | Thu, Jan 16, 2020, 09:15 AM
కటక్ : ఒడిశాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఉదయం కటక్ సమీపంలో ఎల్టీటీ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ముంబయి నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఎల్టీటీ ఎక్స్ప్రెస్ 6 బోగీలు నిర్గుండి వద్ద పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 50 మందికిపైగా గాయపడగా.. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను కటక్లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
Latest News