by సూర్య | Tue, Jan 14, 2020, 07:56 PM
పవన్ కళ్యాణ్, చంద్రబాబులు ముందు వారి భాష మార్చుకుంటే తాము కూడ మార్చుకుంటామని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పవన్, చంద్రబాబులు సీఎం జగన్ ను చాలా నీచమైన భాషలో తిట్టారని గుర్తు చేశారు. కాకినాడలో జనసేన కార్యకర్తలు ధర్నా ఒకచోట చేసి దాడికి తన ఇంటి మీదకు వచ్చారని ఆరోపించారు. ఇంటి మీదకు దాడికి వస్తే చేతులు ముడుచుకుని కూర్చోవాలా అంటూ ద్వారంపూడి మండిపడ్డారు. దాడిలో గాయపడిన వీర మహిళలంతా కాకినాడకు చెందిన వారు కాదని ఎద్దేవా చేశారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడను చంద్రబాబు ప్రభుత్వం చిత్రహింసలకు గురిచేసినప్పుడు పవన్ ఎక్కడికి పోయారని ప్రశ్నించారు.
Latest News