by సూర్య | Tue, Jan 14, 2020, 05:56 PM
ట్విటర్లో సెటైర్లు వేయడంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనకు తానేసాటి అని చెప్పుకోవచ్చు. టీడీపీ నేతలపై ట్విటర్లో విమర్శలు చేయడంలో విజయసాయి ముందుంటారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన స్టైయిల్లో సెటైర్లు వేశారు. యాజమాని ఆర్డర్ ఇస్తే ఫ్యాకేజ్ స్టార్ బీజేపీ చుట్టూ తిరుగతున్నాడని పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు సంధించారు. బీజేపీని తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు మాజీ సీఎం చంద్రబాబు ముందుగా పావలాను ఢిల్లీకి పంపించడాని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలానికి పొత్తు వల్ల ఒరిగేదేమి లేకున్నా.. సైకిల్ పార్టీకి మేలు జరిగేలా చూసుకోవాలన్నది చంద్రబాబు ఎత్తుగడగా కనిపిస్తోందని విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
ముందుగా బంగారు నగల సేకరణకు దిగారని.. ఆ తర్వాత జోలె పట్టుకుని ఊరురా తిరుగుతున్నారని అన్నారు... చివర్లో వచ్చిన డబ్బును నలుగురు పంచుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోతారని చంద్రబాబును ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.
Latest News