by సూర్య | Tue, Jan 14, 2020, 04:43 PM
ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. పోలవరం ప్రాజెక్టు స్టేటస్ రిపోర్టుతో పాటు నిర్మాణ చిత్రాలను కోర్టుకు అందజేయవల్సింగా ఆదేశాలిచ్చింది. పోలవరం నిర్మాణంపై తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే మణుగూరు ఫ్లాంట్ తో పాటు గిరిజనులకు నష్టం లేకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం కోర్టును కోరింది. బచావత్ అవార్డుకు భిన్నంగా ప్రాజెక్టును మార్చారని ఒడిశా సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది. తెలంగాణ, ఒడిశా ప్రభుత్వాలు లేవనెత్తిన అంశాలపై రెండు వారాల్లోగా ఏపీ ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.
Latest News