ఏలూరులో కోడి పందేల నిర్వహణ రసాభాస

by సూర్య | Tue, Jan 14, 2020, 03:09 PM

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కోడి పందేల నిర్వహణ రసాభాసగా మారింది. కోడి పందేల నిర్వహణకు అనుమతి లేదంటూ.. అక్కడున్న పందెం బరులను, టెంట్లను తొలగించారు పోలీసులు. ఈ సందర్భంగా పోలీసులకు, నిర్వాహకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు వెనుదిరిగిన అనంతరం మళ్లీ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. కోడి పందేల నిర్వహణకు అధికారులు అనుమతి ఇవ్వని పక్షంలో.. కోకో.. కబడ్డీ ఆటలు ఆడుతామంటూ స్థానికులు పేర్కొంటున్నారు.


కాగా.. అసలు సంక్రాంతి అంటేనే కోడి పందేలు. వీటిని అనాధి కాలం నుంచి ఏపీ వాసులు సంప్రదాయంగా, భారీ ఏర్పాట్లతో నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే.. గతేడాది.. వీటిపై కోర్టులో కేసులు నడవగా.. పోలీసులు ముందస్తుగానే బైండోవర్ కేసులు పెట్టి.. పూర్తిస్థాయిలో అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. పందెం రాయుళ్లు మాత్రం పంతం వీడేలా కనిపించడంలేదు.


 


 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM