by సూర్య | Tue, Jan 14, 2020, 02:26 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, పోలీసులపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విమర్శలు చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. మహిళలను ఇష్టమొచ్చినట్లు కొట్టి మంచినీళ్లు ఇవ్వకుండా వేధించారని విమర్శించారు. మహిళలపై పోలీసుల చర్యలు దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. శాంతియుతంగా ఆందోళనలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోర్టు చెప్పిందని స్పష్టంచేశారు.ఇది అమరావతి సమస్య మాత్రమే కాదని, రాష్ట్ర ప్రజల సమస్య అని చప్పుకొచ్చారు. మన పిల్లల భవిష్యత్ కోసం అమరావతి రాజధానిగా కొనసాగాలని కోరారు.
Latest News