by సూర్య | Tue, Jan 14, 2020, 12:42 PM
గుంటూరు కలెక్టరేట్ దగ్గర చలసాని శ్రీనివాస్ మౌన దీక్ష చేపట్టారు. రాజధాని రైతులతో కలిసి చలసాని శ్రీనివాస్ దీక్షలో కూర్చున్నారు. చలసాని దీక్ష సాయంత్రం వరకు కొనసాగనున్నది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా - విభజన హామీల సాధనసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షలో వివిధ వర్గాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చలసాని మాట్లాడుతూ పాలకులు మారగానే రాజధానిని మార్చడం ఏకపక్ష నిర్ణయం అని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు మేం వ్యతిరేకం కాదు అని అన్నారు. అమరావతి రైతుల దీక్షకు సంగిభావం తెలుపుతున్నామన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే శిక్షలు వేయండి అన్నారు.
Latest News