ఎమ్మెల్యే రోజా ఇంట్లో సంక్రాంతి సందడి

by సూర్య | Tue, Jan 14, 2020, 11:57 AM

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి కనిపిస్తోంది. భోగి మంటలు, గొబ్బెమ్మలు, ముగ్గులతో పండుగ వాతావరణం ఉంది. ప్రముఖులంతా ఈ సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇటు ఏపీఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా ఇంట్లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరిలో కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు.


'అందరి జీవితల్లో చీడ- పీడ ఆ భోగి మంటల్లో కలిసి, కొత్త వెలుగులు ప్రసరించాలని.. భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలు మీ దరి చేరాలని కోరుకుంటూ' అందరికి భోగి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే రోజా.


రెండు రోజులుగా నగరిలో ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. తన కుటుంబంతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సంబరాల్లో రోజా తన కూతురు అన్షూ మాలికతో కలిసి సందడి చేశారు. రోజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రోజా కూతురు అన్షూ మాలికతో కలిసి ఎడ్ల బండిపై ఎక్కి అందర్నీ ఉత్సాహపరిచారు. తర్వాత మహిళలు, తన కూతురితో కలిసి ముగ్గులు వేశారు. పిల్లలకు స్వయంగా బోగిపళ్లు పోశారు.. సరదాగా చిలకతో జోస్యం చెప్పించుకున్నారు. నియోజకవర్గానికి చెందిన మహిళలతో కలిసి ఈ వేడుకల్లో ఉత్సాహంగా గడిపారు.


 


సంక్రాంత్రి సంబరాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సంక్రాంత్రి సంబరాల జోష్‌ను వైఎస్సార్‌సీపీ కేడర్‌తో పంచుకున్నారు. అంతేకాదు ప్రతి ఏటా రోజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM