by సూర్య | Mon, Jan 13, 2020, 06:51 PM
గతంలో నరేంద్ర మోదీకి దూరం జరగడం చంద్రబాబు తప్పేనని టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. మందడంలో రైతుల దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చిన రాయపాటి మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు హయాంలో కొన్ని తప్పులు జరిగాయని, ఆ సమయంలో చంద్రబాబు మోదీని విభేదించకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అయితే, అది తాత్కాలికమేనని, వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్ ఒక్కటవుతారని జోస్యం చెప్పారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని అన్నారు. కాగా, రాయపాటి ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలోనే, కలిసి పనిచేయాలని బీజేపీ, జనసేన పార్టీలు నిర్ణయించుకున్నట్టు వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Latest News