చంద్రబాబు హయాంలో కొన్ని తప్పులు జరిగాయి : టిడిపి నేత రాయపాటి

by సూర్య | Mon, Jan 13, 2020, 06:51 PM

గతంలో నరేంద్ర మోదీకి దూరం జరగడం చంద్రబాబు తప్పేనని టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. మందడంలో రైతుల దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చిన రాయపాటి మీడియాతో మాట్లాడారు.


చంద్రబాబు హయాంలో కొన్ని తప్పులు జరిగాయని, ఆ సమయంలో చంద్రబాబు మోదీని విభేదించకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అయితే, అది తాత్కాలికమేనని, వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్ ఒక్కటవుతారని జోస్యం చెప్పారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని అన్నారు. కాగా, రాయపాటి ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలోనే, కలిసి పనిచేయాలని బీజేపీ, జనసేన పార్టీలు నిర్ణయించుకున్నట్టు వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Latest News

 
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం, నిందలు.. సీఎం జగన్‌కు వివేకా భార్య సౌభాగ్యమ్మ లేఖ Thu, Apr 25, 2024, 07:15 PM
వైసీపీ ఎమ్మెల్యే నామినేషన్‌ ర్యాలీలో అపశృతి.. మంటల్లో కాలిపోయిన టీడీపీ కార్యకర్త ఇల్లు Thu, Apr 25, 2024, 07:10 PM
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ.. భారీగా నామపత్రాలు దాఖలు Thu, Apr 25, 2024, 07:06 PM
రూ.కోటి లోపు ఆస్తి ఉన్న అభ్యర్థులు ఎవరో చుద్దాం రండి Thu, Apr 25, 2024, 07:04 PM
నో యువర్‌ క్యాండిడేట్‌ ద్వారా అన్ని వివరాలు అందుబాటులోకి Thu, Apr 25, 2024, 06:57 PM