by సూర్య | Mon, Jan 13, 2020, 05:02 PM
ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్తో ఎందుకు భేటీ అయ్యారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రశ్నించారు. కేసీఆర్, తెలంగాణపై జగన్కు అంత ప్రేమే ఉంటే.. సీఎం పదవికి రాజీనామా చేసి కేసీఆర్ కేబినెట్లో చేరాలన్నారు. అమరావతి అభివృద్ధిపై విషం కక్కుతున్న.. కేసీఆర్తో ఎందుకు సమావేశమయ్యారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, జగన్ 7నెలల్లో ఐదుసార్లు భేటీ అయ్యారని, అమరావతి ఉద్యమం జరుగుతుంటే పట్టించుకోలేదన్నారు. కరకట్ట కమల్హాసన్ కిరాయి వ్యక్తులతో ర్యాలీ చేశాడని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ టీడీపీ నేత లోకేశ్పై పోటీ చేయాలని సవాల్ విసిరారు. లోకేశ్ గెలిస్తే రాష్ట్ర ప్రజలంతా అమరావతినే కోరుకుంటున్నట్లని, ఆళ్ల గెలిస్తే జగన్ మూడుముక్కలాటను సమర్థించినట్లని బుద్దా వెంకన్న అన్నారు.
Latest News