జైల్లో ఉన్న రైతులను పరామర్శించిన లోకేష్

by సూర్య | Mon, Jan 13, 2020, 04:03 PM

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 27 రోజులుగా జరుగుతున్న నిరసనలు ఇప్పటికీ ఆగలేదు. రాజధాని పరిధిలోని రైతులు టెంట్ లు వేసుకుని ప్రదర్శనలు చేపడుతున్నారు. కొన్నిచోట్ల ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. రోడ్డు దిగ్బంధం కేసులో రైతులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో జైలుపాలైన 19 మంది రాజధాని రైతులను టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పరామర్శించారు. గుంటూరు జిల్లా జైలుకు వెళ్లి రైతుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, రైతులను అడ్డుకుని ఉద్యమం అణచివేయాలని ప్రభుత్వం భావిస్తోందని మండిపడ్డారు. జేఏసీ నేతలపైనా ఇష్టం వచ్చినట్టు కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM