by సూర్య | Mon, Jan 13, 2020, 03:59 PM
రాజధానిలో పరిస్థితులపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్, 30 యాక్ట్ అమలును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. రాజధాని గ్రామాల్లో పరిస్థితిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 144 సెక్షన్, లాఠీచార్జ్ అంశాలను హైకోర్టు సుమోటోగా తీసుకుంది. పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది. గ్రామీణ ప్రాంతాల్లో మార్చ్ ఫాస్ట్ పై హైకోర్టు ప్రశ్నించింది. కర్ఫ్యూ వాతావరణంలా కనిపిస్తోందని హైకోర్టు అన్నది.
Latest News