by సూర్య | Mon, Jan 13, 2020, 02:33 PM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ముగిసింది. నిన్న ఆర్ ఎస్ ఎస్ నేతలతో చర్చలు జరిపిన పవన్ ఈ రోజు బిజెపి నేత నడ్డాను కలిశారు. ఈ భేటీలో ఏపీ 3 రాజధానుల అంశంపై నడ్డాతో చర్చించారు పవన్. ఈ భేటీ తరువాత తిరిగి ఆంధ్ర ప్రదేశ్ కు తిరుగుప్రయాణమయ్యారు జనసేనాని. ఈ రోజు కాకినాడకు చేరుకోనున్నారు పవన్. అయితే ఈ భేటీ లో ఎవ్వరు ఊహించని విధంగా బిజెపితో జనసేన పొత్తుకు సంబంధించిన చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తుంది. మొదటగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితి పై కేంద్రం పెద్దలకు వివరించడంతో పాటు జనసేన పార్టీని బిజెపితో కలిసి ముందుకు నడవడానికి సంబంధించి తాను అంగీకారం తెలియజేసినట్లు తెలుస్తుంది. ఇంకా దీని పైన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Latest News