మరోసారి 17న భేటీ కానున్న హైపవర్ కమిటీ

by సూర్య | Mon, Jan 13, 2020, 01:25 PM

రాజధాని అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ముచ్చటగా మూడోసారి సమావేశమైనా ఏమీ తేల్చకుండానే ముగించింది. సంక్రాంతి అనంతరం ఈ నెల 17న మరోసారి సమావేశమవ్వాలని నిర్ణయించింది. విజయవాడలోని ఆర్టీసీ సమావేశ మందిరంలో భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ రైతులు ఏమైనా చెప్పదల్చుకుంటే వారి నుంచి లిఖిత పూర్వకంగా తీసుకోవాలని నిర్ణయిం చినట్లు తెలిపారు. తమ విజ్ఞాపనలను రైతులు నేరుగా సీఆర్డీఏ కమిషనర్ కు  అందించినా పర్వాలేదని, ఆన్ లైన్లో ఇచ్చినా సరిపోతుందని తెలిపారు. కాగా, ఈ భేటీలో రాజధాని అంశంపై ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై కమిటీ చర్చించింది. ఇంతకు ముందు జరిగిన రెండు సమావేశాల్లో రైతుల ఆందోళన, సచివాలయం ఉద్యోగుల డిమాండ్ల పై చర్చించారు.

Latest News

 
టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు Tue, Apr 16, 2024, 01:30 PM
గురజాల జనసేన అభ్యర్ధి వైసీపీలోకి చేరిక Tue, Apr 16, 2024, 01:27 PM
ప్రజల వద్దకే పరిపాలన తెచ్చిన నాయకుడు సీఎం జగన్ Tue, Apr 16, 2024, 01:26 PM
సునీత చెప్పేవన్నీ అబద్దాలే Tue, Apr 16, 2024, 01:25 PM
కొనసాగుతున్న మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర Tue, Apr 16, 2024, 01:25 PM