by సూర్య | Mon, Jan 13, 2020, 11:51 AM
మంగళగిరి పీఎస్ నుంచి ఆళ్ల రామకృష్ణ రెడ్డి విడుదలయ్యారు. రాజధాని వికేంద్రీకరణ జరగాలంటూ ఆర్కే ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్కే ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అయినను అరెస్ట్ చేశారు. కొద్దిసమయం తరువాత ఆర్కేను పోలీసులు విడుదల చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ... రైతులను చంద్రబాబు మోసం చేశారు. అమరావతిపై కావాలనే చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. నా ర్యాలీకి కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదని, ర్యాలీ చేపట్టినందుకు నన్ను కూడా అరెస్ట్ చేశారు. అధికార వికేంద్రీకరణ కోసం మేం ర్యాలీ చేస్తే అరెస్ట్ చేశారు. 144 సెక్షన్, 30 యాక్ట్ అమల్లో ఉంటే ఎవరికీ అనుమతి ఇవ్వరు అని ఆయన అన్నారు. కానీ పికెటింగ్ లు, ధర్నాల పేరుతో చంద్రబాబు మోసం చేస్తున్నారు. ఐదేళ్లు సీఎంగా ఉండి రాజధాని పేరుపై వేల కోట్లు దోచుకుంటున్నారు. రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని అయన అన్నారు.
Latest News