by సూర్య | Mon, Jan 13, 2020, 11:37 AM
అనంతపురం : ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హిందూపురం, అనంతపురం పార్లమెంటు పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు ఆయన బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య పెనుకొండలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. సాయంత్రం చెన్నేకొత్తపల్లి, మామిళ్లపల్లి, రాప్తాడు మీదుగా బళ్లారి బైపాస్కు చేరుకుంటారు. సాయంత్రం 4.10 గంటలకు నగరంలోని క్లాక్ టవర్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. 6.30 గంటలకు నగరంలోని సప్తగిరి సర్కిల్లో నిర్వహించనున్న బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు.
Latest News