by సూర్య | Mon, Jan 13, 2020, 11:27 AM
పవన్ కళ్యాణ్ ఢిల్లీలోనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు బీజేపీ పెద్దల అపాయింట్ మెంట్ దొరకలేదు. ఇవాళ రాత్రి 7 గంటలకు పవన్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రానున్నారు. శనివారం మంగళగిరిలోని పార్టీ ఆఫీస్లో విస్త్రృత స్థాయి సమావేశం జరుగుతున్న తరుణంలో... ఢిల్లీ నుంచీ పవన్ కళ్యాణ్కి పిలుపు వచ్చింది. ఢిల్లీ పర్యటనలో జనసేనాని పలువురు కీలక నేతలు, కేంద్ర మంత్రులతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలు.. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితులతో పాటు రాజకీయ అంశాలపై చర్చించే ఛాన్స్ ఉందని సమాచారం. ముఖ్యంగా రాజధాని అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతారనే చర్చ జరుగుతోంది. కానీ జనసేన అధినేత ఢిల్లీ టూర్పై ఆ పార్టీ నుంచి ఎలాంటి అధికారక సమాచారం లేకపోవడం విశేషం.
Latest News