by సూర్య | Mon, Jan 13, 2020, 11:17 AM
చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్టించుకోలేదని దాడి వీరభద్రరావు అన్నారు. ఎన్టీఆర్ ప్రాజెక్టులను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. అత్యంత వెనుకబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర అని దాడి అన్నారు. విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని అన్నారు. విశాఖ రైల్వేజోన్ ను చంద్రబాబు వ్యతిరేకించారు. విశాఖ అంటే చంద్రబాబుకు ఎందుకంత కోపం అని అయన అన్నారు. ఈవెంట్ల కోసమే విశాఖను వాడుకున్నారని ఆయన తెలిపారు. విశాఖకు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు అన్నారు.
Latest News