by సూర్య | Sun, Jan 12, 2020, 07:13 PM
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆమె మాట్లాడారు. ఆమె ఏం అన్నారంటే…“చంద్రబాబు నాయుడు కావాలనే ప్రజలను రెచ్చగొడుతున్నారు. రాజధాని తరలిస్తున్నామని ఎవరు చెప్పారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. రాజకీయాలలోకి మహిళలను లాగవద్దని జాతీయ మహిళా కమిషన్ చురకలు అంటించినా చంద్రబాబుకు బుద్ది రాలేదు. పవన్ కళ్యాణ్ కర్నూల్ రాజధాని కావాలని అన్నారు. ఇప్పుడు మాట మార్చుతున్నారు. బీజేపీ నేతలు యూటర్న్ తీసుకోవడం బాధాకరం.” అని ఆమె అన్నారు.
Latest News