500 వీడియోలు, 1000 ఫొటోలను కమిషన్ సభ్యులకు అందజేశాం : కేశినేని నాని

by సూర్య | Sun, Jan 12, 2020, 05:37 PM

రాజధాని ప్రాంతంలో పోలీసుల తీరు కారణంగా మూడు వేల మంది మహిళలు పడ్డ ఇబ్బందులను జాతీయ మహిళా కమిషన్ కు వివరించామని టీడీపీ ఎంపీ కేశినేని అన్నారు. తుళ్లూరులో జాతీయ మహిళా కమిషన్ సభ్యులు పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 500 వీడియోలు, 1000 ఫొటోలను కమిషన్ సభ్యులకు అందజేశామని, మహిళలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చేశారని, పోలీసుల తీరు అర్థం కావడం లేదని, అధికారంలో ఎవరున్నా వారి తీరు మారకూడదని సూచించారు. మహిళలతో కన్నీరు పెట్టించిన ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాజధాని మహిళలపై దాడి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM