by సూర్య | Sun, Jan 12, 2020, 04:39 PM
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సేవ్ అమరావతి ఉద్యమంలో భాగంగా గుంటూరు జిల్లా నరసరావుపేట వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, రాజధాని ఉద్యమ ర్యాలీకి పోలీసులు అభ్యంతరం చెప్పారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్ నుంచి ర్యాలీ నిర్వహించగా, చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. కానీ చంద్రబాబు పోలీసుల అభ్యంతరాలను లెక్కచేయకుండా ముందుకు సాగారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Latest News