వైసీపీపై విమర్శలు గుప్పించిన యనమల

by సూర్య | Sun, Jan 12, 2020, 02:12 PM

ప్రపంచంలోని ఐదు ఉత్తమదేశాల్లో సింగపూర్ ఒకటి అని, అందుకే, దానిని ఆదర్శంగా తీసుకుని రాజధాని అమరావతిని నిర్మించాలనుకున్న విషయాన్ని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు గుర్తుచేసుకున్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం మాత్రం దక్షిణాఫ్రికా దేశాన్ని పోలికగా తీసుకుంటూన్నారని, దీనిని బట్టే తెలుస్తోందని సీఎం జగన్ మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఎలా ఉందో అర్థమవుతోందని విమర్శించారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెబుతున్న జగన్, మరో చోటకు వెళ్లి రాజధాని నిర్మించాలన్న ఆలోచన కరెక్టు కాదని అన్నారు. విశాఖపట్టణాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే పోలవరం ప్రాజెక్టు పనులను ఎందుకు నిలిపివేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖకు జగన్ చేసింది లాభం కాదు నష్టమని మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీకి అప్పు కూడా పుట్టని పరిస్థితి అని, వీళ్ల మొఖాలు చూసి ఎవరూ ముందుకు రావడం లేదంటై వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM