అమరావతి పరిస్థితులపై స్పందించిన చంద్రబాబు భార్య భువనేశ్వరి

by సూర్య | Sun, Jan 12, 2020, 02:09 PM

అమరావతి రైతుల పరిస్థితులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి భార్య నారా భువనేశ్వరి స్పందించారు. రైతులు బాధల్లో ఉంటే సంక్రాంతి జరుపుకోవడానికి మనసు రావట్లేదని, ఈ పండుగను చేసుకోకూడదని నిర్ణయించుకున్నామని చెప్పారు.


చిత్తూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ... రాజధాని అమరావతి రైతులకు ప్రజలంతా అండగా ఉండాలని ఆమె అన్నారు. మహిళలు, రైతులు చేసే ఉద్యమాన్ని ఆమె ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, వారికి ఉద్యోగాలు వస్తాయన్న కోరికతో రైతులు  భూములు ఇచ్చారని ఆమె చెప్పారు. లభాల కోసమే పెట్టుబడులు పెడతారని, ప్రస్తుతం పెట్టుబడులు వచ్చే పరిస్థితులు లేవని విమర్శించారు. కాగా, అమరావతి పరిరక్షణ సమితికి ఆమె ఇటీవలే తన గాజులను విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM