by సూర్య | Sun, Jan 12, 2020, 02:09 PM
అమరావతిలో గత 24 రోజులుగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడం, తూళ్లూరు గ్రామాల్లో 144 సెక్షన్ కోనసాగుతోంది. ధర్నా కోసం టెంట్లు వేయడానికి వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు ధర్నాలు, నిరసనలకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. రెండు మండలాల గ్రామాల ప్రజలు ఎవరూ కూడ ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు మైకుల్లో ప్రచారం చేశారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఒక్కో గ్రామంలో వేయి మంది పోలీసులు ఉన్నారని... ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా..? లేక పోలీస్ రాజ్యమా అని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రశ్నించారు.
Latest News