విశాఖలోనే గణతంత్ర వేడుకలు

by సూర్య | Sun, Jan 12, 2020, 02:05 PM

ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలను విశాఖలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖలోని ఆర్కే బీచ్ లో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో పాల్గోననున్నారు. ఇప్పటికే విశాఖను ఎగ్జిక్యూటీవ్ కేపిటల్ చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలోనే గణతంత్ర వేడుకలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఐదేళ్లుగా రిపబ్లిక్ డే వేడుకలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. అయితే రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు.. రాజధాని మార్పు నేపథ్యంలో విశాఖలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపనున్నారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM