by సూర్య | Mon, Oct 14, 2019, 08:28 PM
తాను నటించిన కొత్త సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నదని ప్రముఖ సినీ నటుడు మహేష్బాబు చెప్పారు. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులో ప్రఖ్యాత భీమా జ్యూవెలర్స్ ఏర్పాటు చేసిన తొలి షోరూంను సినీ నటుడు మహేష్బాబు ఆదివారం ఉదయం ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్బాబు మాట్లాడుతూ తాను ఎప్పుడు విజయవాడ వచ్చినా చాలా ఆనందంగా ఉంటుందని, తన సినిమాలకు సంబంధించి విజయోత్సవ వేడుకలు ఎక్కువగా విజయవాడలో నిర్వహించడం జరిగిందన్నారు. తాను నటించిన కొత్త సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ఆ సనిమా అభిమానులు గర్వపడేలా ఉంటుందన్నారు. భీమా జ్యూవెలర్స్ వజ్రాభరణాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మహేష్బాబును చూసేందుకు అభిమానులు వేలాదిగా తరలిరావడంతో మహాత్మాగాంధీరోడ్డులో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఒక దశలో అభిమానులను నిలువరించడం పోలీసులకు కష్టతరంగా మారింది. ఈ సందర్భంగా భీమా జ్యూవెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ బి.కృష్ణన్ మాట్లాడుతూ గడచిన తొమ్మిదినర్న దశాబ్ధాల కాలంగా ఆభరణాలలో ఉత్తమ పేర్లల్లో ఒకటి అయిన, గొప్ప హస్తకళ, స్వచ్చత మరియు నమ్మకానికి చిహ్నమైన తమ సంస్థ భీమా జ్యూవెలర్స్ తొలి షోరూంను ఏపీలో అది కూడా ముఖ్యంగా విజయవాడలో ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. పండగ సీజన్కి స్వాగతం పలుకడంతో పాటు సర్ప్రైజ్ ఆఫర్లను కూడా ప్రకటించిందన్నారు. నవంబర్ 25 వరకు ఈ ఆఫర్లో భాగంగా భీమాలో కొనుగోలు చేసే వినియోగదారులు కొత్త ఎస్.యు.వి – కియా సెల్ట్స్ మరియు 3 ఝండా డియోస్ స్కూటర్ల రూపంలో బంపర్ ప్రైజ్ని గెలుచుకునే అవకాశం ఉందన్నారు. అలాగే ప్రతి గ్రాము బంగారంపైన రూ.400 తగ్గింపు, ప్రతి క్యారెట్ డైమండ్ జ్యూవెలరీ కొనుగోలుపై రూ.13వేలు తగ్గింపు మరియు వెండి మేకింగ్ చార్జీలపై 25శాతం తగ్గింపు అదనపు ప్రయోజనాలుగా పొందవచ్చని పేర్కొన్నారు. భీమా జ్యూవెలర్స్ డైరెక్టర్ విష్ణుశరణ్ కె భట్ మాట్లాడుతూ అత్యుత్తమ నాణ్యత, డిజైన్లను అందించడంలో తమకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. ప్రారంభోత్సవంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్, షోరూం ప్రతినిధులు, భారీగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Latest News