ప్రాజెక్టులతో ఎన్‌ఆర్‌ఐలు ఏపీకి రండి : టీటీడీ చైర్మన్‌

by సూర్య | Mon, Oct 14, 2019, 06:20 PM

ఎన్‌ఆర్‌ఐలు ఉద్యోగాలు కల్పించేలా ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్‌కు రావాలని ఇందుకు తమ వంతు సహకారం ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సింగపూర్‌లో జరిగిన శ్రీనివాస కల్యాణానికి హాజరైన అయన అక్కడి ఎన్‌ఆర్‌ఐలతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి వారికి వివరించారు. సింగపూర్‌లో గాని తమ గ్రామాల్లో గాని ఏ సమస్య అయినా ఉందని చెబితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరిస్తామని భరోసానిచ్చారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం అధ్యక్షుడు బి.శ్రీనివాస్‌రెడ్డి, కన్వీనర్‌, డి.ప్రకాష్‌రెడ్డి, సభ్యులు మహేష్‌రెడ్డి, వేణుగోపాలరెడ్డి, సత్య, నాగరాజు, సంతోష్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, వీరారెడ్డి పాల్గొన్నారు.


 

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM