by సూర్య | Mon, Oct 14, 2019, 02:46 PM
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి దంపతులు భేటీ అయ్యారు. చిరంజీవి దంపతులను సీఎం వైఎస్ జగన్ ఆహ్వానించారు. చిరంజీవి ఇటీవల నటించిన చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి విడుదలై విజయపథంలో దూసుకెళ్తోంది. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం విజయం సాధించడంతో చిత్రాన్ని చూడవలసిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని చిరంజీవి కలిశారు.
Latest News