by సూర్య | Mon, Oct 14, 2019, 11:31 AM
అమరావతి : మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టనన్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. నవంబర్ 14న నాడు- నేడు కార్యక్రమం ప్రారంభo. వచ్చే నాలుగేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించాలని సర్కార్ లక్ష్యం. ప్రతి ఏడాది 1500 కోట్లు చొప్పున నాలుగేళ్లలో 6 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్న సర్కార్ . ప్రైవేటు కాంట్రాక్టర్ లతో కాకుండా... కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్ధతిన దేశంలోనే తొలిసారి అమలు చేయాలని జగన్ నిర్ణయం. ప్రజల భాగస్వామ్యంతో ప్రతి స్కూల్ ఆధునికీకరణ. నేడు స్కూల్ ఎలా ఉంది.. నాలుగేళ్ల తరువాత ఎలా ఉందో ఫొటోలతో ప్రజల ముందుంచాలని భావిస్తున్న సీఎం వైఎస్ జగన్. అవినీతికి ఆస్కారం లేకుండా ఉండేందుకే కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్ధతిని అవలంభిస్తున్న జగన్.
Latest News