నేడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో ప్రముఖ సినీనటుడు చిరంజీవి భేటీ

by సూర్య | Mon, Oct 14, 2019, 09:33 AM

అమరావతి :  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో ప్రముఖ సినీనటుడు చిరంజీవి భేటీ కానున్నారు. సోమవారం మధ్యాహ్నం సీఎం జగన్‌ను చిరంజీవి, ఆయన కుమారుడు, సినీనటుడు రామ్‌చరణ్‌ మర్యాదపూర్వకంగా కలువనున్నారు.చిరంజీవి ఇటీవల నటించిన చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి విడుదలై విజయపథంలో దూసుకెళ్తోంది. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం విజయం సాధించడంతో చిత్రాన్ని చూడవలసిందిగా ఆహ్వానించే నిమిత్తం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని చిరంజీవి కలువనున్నారు. వాస్తవానికి ఈ భేటీ నాలుగురోజుల ముందుగానే జరగాల్సి ఉంది. అయితే సీఎం ఢిల్లి పర్యటన నేపథ్యంలో భేటీ సోమవారానికి వాయిదా పడింది.

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM