by సూర్య | Mon, Oct 14, 2019, 09:33 AM
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ప్రముఖ సినీనటుడు చిరంజీవి భేటీ కానున్నారు. సోమవారం మధ్యాహ్నం సీఎం జగన్ను చిరంజీవి, ఆయన కుమారుడు, సినీనటుడు రామ్చరణ్ మర్యాదపూర్వకంగా కలువనున్నారు.చిరంజీవి ఇటీవల నటించిన చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి విడుదలై విజయపథంలో దూసుకెళ్తోంది. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం విజయం సాధించడంతో చిత్రాన్ని చూడవలసిందిగా ఆహ్వానించే నిమిత్తం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని చిరంజీవి కలువనున్నారు. వాస్తవానికి ఈ భేటీ నాలుగురోజుల ముందుగానే జరగాల్సి ఉంది. అయితే సీఎం ఢిల్లి పర్యటన నేపథ్యంలో భేటీ సోమవారానికి వాయిదా పడింది.
Latest News