by సూర్య | Sun, Oct 13, 2019, 11:03 PM
ఎమ్మెల్సీ గా టిడిపి తరపున ఎన్నికైన వాకాటి నారాయణరెడ్డి ఆర్థిక నేరారోపణలతో 2018లో జైలు కెళ్లడంతో ఆతన్ని అధిష్టానం సరిగా పట్టించుకోలేదన్న వాదన ఆయన వర్గీయులు వినిపించేవారు. ఈ క్రమంలోనే వాకాటి బీజేపీలో చేరుతారంటూ వార్తలు గుప్పుమన్నాయి., ఆ తర్వాత బెయిల్పై విడుదల కావడంతో ఆఘమేఘాల మీద ఆయన కమల దళంలో చేరిగా, మరికొందరు ఇప్పటికీ టిడిపిలోనే కొనసాగుతున్నా పార్టీ కార్యక్రమాలలో పెద్దగా పాల్గొంటున్నది లేదు. బిజెపిని వేళ్లూరేలా చేసేందుకు. ప్రస్తుతం వీరందరినీ బీజేపీలోకి రావాల్సిందిగా వాకాటి కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన అనుచరులనూ బీజేపీలోకి తీసుకువెళ్లేందుకు వాకాటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Latest News