by సూర్య | Sun, Oct 13, 2019, 01:49 PM
ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ ఆరోపించారు. ఆయన శనివారం ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. పౌరహక్కులను హరిస్తూ సీఎం జగన్... నిరంకుశ పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం వేస్తున్న తప్పటడుగులు ప్రజలను కలవరపెడుతున్నాయని ఆరోపించారు. అధికారుల స్పందన కోసం ఓ ఎమ్మెల్యే రాత్రంతా మున్సిపల్ కార్యాలయంలోనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడిందని లేఖలో పేర్కొన్నారు. జగన్ అనుభవలేమి, అవగాహనారాహిత్యం వల్ల... రాష్ట్రం సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని దుయ్యబట్టారు.
Latest News