by సూర్య | Sun, Oct 13, 2019, 12:04 PM
గత కొద్ది రోజులుగా సీఎం జగన్, వైసీపీ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు మధ్య కాస్త వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. పురందేశ్వరి కూడా వైసీపీలో చేరాలని లేకపోతే ఇద్దరు కలిసి ఏదో ఒక పార్టీలో మాత్రమే ఉండాలని సీఎం జగన్ కాస్త ఘాటుగానే దగ్గుబాటికి చెప్పినట్టు తెలుస్తోంది. పురంధేశ్వరి వైసీపీ పై, సీఎం జగన్ పై కూడా విమర్శలు చేయడంతోనే ఈ వివాదం ప్రారంభమైనట్టు సమాచారం. పురంధేశ్వరి విమర్శలు చేసినా వెంకటేశ్వరరావు నిశ్శబ్దంగా ఉండటం సీఎం జగన్ కు ఆగ్రహం తెప్పించిందట. మొత్తానికి ప్రస్తుత పరిస్థితి అర్ధమయిన దగ్గుబాటి బీజేపీలో చేరేందుకు సిద్దపడ్డట్టు తెలుస్తోంది. ఎందుకంటే పురంధేశ్వరి ఎట్టి పరిస్థితిలోనూ వైసీపీలో చేరదని, ఇక పార్టీ మారితే తానే మారాల్సి వస్తుందని సన్నిహితుల వద్ద వెంకటేశ్వరరావు అన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పురంధేశ్వరి అమెరికా టూర్ లో ఉండడంతో ఆమె రాగానే తన నిర్ణయాన్ని సీఎం జగన్ కు చెప్పేందుకు వెంకటేశ్వరరావు సిద్దమయ్యారని సమాచారం.
Latest News