by సూర్య | Sun, Oct 13, 2019, 09:27 AM
తనపై టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ తనపై రూ.100కోట్ల పరువు నష్టం దావా వేస్తామనడంపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగానే స్పందించారు. రవిప్రకాష్, చంద్రబాబును టార్గెట్ చేస్తూ ట్విట్టర్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మీడియాను అడ్డం పెట్టుకుని 15 సంవత్సరాల పాటు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాడు మీడియా నయీం. చంద్రబాబు అండ చూసుకుని ఎంతో మంది జీవితాలను రోడ్డున పడేశాడు. ఇప్పుడు తనే పెద్ద బ్రేకింగ్ న్యూసై పోయాడు. వంద కోట్లు ఏం ఖర్మ వెయ్యి కోట్లకు వేసుకో పరువు నష్టం దావా’అంటూ కౌంటర్ ఇచ్చారు.
Latest News