by సూర్య | Sun, Oct 13, 2019, 07:48 AM
తిరుమల భక్తజనసంద్రమైంది. వారాంతం, రెండో శనివారం, పెరటాసి నెలలో చివరి శనివారం కలసి రావడంతో కొండ కిటకిటలాడుతోంది. రద్దీ ఎక్కువగా ఉండటంతో సర్వదర్శనానికి దాదాపు 20 గంటలు పడుతోంది. వాహనాల్లోనూ, నడక మార్గాల్లోనూ భక్తులు ప్రవాహంలా కొండకు చేరారు. ఉదయం నుంచే వసతిగృహాలు, కల్యాణకట్టల వద్ద భక్తులు బారులుతీరారు. రెండు క్యూకాంప్లెక్సులు నిండి క్యూలైను దాదాపు 3కిలోమీటర్ల వరకు వెలుపలకు వచ్చింది. శనివారం అర్ధరాత్రి ఏకాంతసేవ వరకు దాదాపు 95వేల మంది భక్తులు స్వామిని దర్శించుకోగా మరో లక్షన్నర మంది వెలుపల నిరీక్షిస్తున్నారు.
Latest News