by సూర్య | Sun, Oct 13, 2019, 01:29 AM
తిరుమల ధర్మగిరిలోని ఎస్వీ వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో 2020 ఫిబ్రవరి 25 నుండి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించనున్న 28వ శ్రీ వేంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు( పరీక్షలు)కు అక్టోబరు 20వ తేదీ సాయంత్రంలోపు దరఖాస్తు చేసుకోవాలని తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారి తెలియజేసారు. శనివారం ఆయన ఓ ప్రకటన విడుదలచేస్తూ, ఈ సదస్సులో 37 వేద శాఖలకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ఏ గ్రేడ్ సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. భవిష్యత్తులో టిటిడి, రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఆలయాలలో అర్చకుల నియామకానికి ఏ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారని ఎస్వీ వేద విజ్ఞాన పీఠం అధికారులు తెలిపారు. గతంలో 27 సార్లు శ్రీ వేంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సులు జరిగాయి. ఇతర వివరాలకు టిటిడి వెబ్సైట్ www.tirumala.org ను సంప్రదించాలని సూచించారు.
Latest News