త్వరలోనే ఆ ఆడపడుచులకు నీటి కష్టాలు తీరబోతున్నాయి!

by సూర్య | Sat, Oct 12, 2019, 11:25 PM

ఇక ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే ఆ ఆడపడుచులకు నీటి కష్టాలు తీరబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ఇంటికీ తాగునీటి కుళాయిని అందించే లక్ష్యంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ ప్రాజెక్టు కోసం 46 వేల 675 కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ బృహత్తర ప్రాజెక్టును రెండు దశల్లో అమలు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది. రాష్ట్రంలోని ప్రతీ ఇంటికీ మంచినీటి కుళాయిని అందించేందుకు ఉద్దేశించిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు అమలుపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చించింది. 2022 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. కనీసం 30 ఏళ్ల పాటు వినియోగించుకునేలా వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ డిజైన్ ఉండాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 46,982 గ్రామీణ ప్రాంతాలకు, 99 పట్టణప్రాంతాల్లో తాగునీటి సరఫరా కోసం ప్రాజెక్టును అమలు చేస్తారు. ఈ ప్రాజెక్టు కోసం మొదటి దశలో 37,475 కోట్లు, రెండో దశలో 9,200 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు ద్వారా 2500 కోట్ల రుణం తీసుకుంటారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM