2 నెలలైనా వెలగని విద్యుత్ దీపాలు

by సూర్య | Sat, Oct 12, 2019, 08:41 PM

పట్టణానికి కలెక్టరేట్ దగ్గర గత ఏడాది క్రితం నిర్మించిన పొన్నాడ బ్రిడ్జి కు ఈ మధ్యనే నెల క్రితం బ్రిడ్జ్ కు ఇరువైపులా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు, అయితే నేటికి 2 నెలలు కావస్తున్నా విద్యుత్ దీపాలు వెలగడం లేదు, దీనికి కారణం ముహూర్తాలు లేవా, రాజకీయ గ్రహణం, అని ఇటు శ్రీకాకుళం పట్టణం ప్రజలు, ఎచ్చెర్ల మండలం సంబంధించిన ప్రజలు దీర్ఘ ఆలోచనలో పడ్డారు, ఏది ఏమైనప్పటికీ, విద్యుత్ దీపాలు వేసిన దరిదాపు రెండు నెలలు కావస్తున్నా దీపాలను వెలిగించక పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చీకటి పడితే ఈ బ్రిడ్జి పైన అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువ అవుతున్నాయని చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు చెబుతున్నారు. ముఖ్యంగా యువత ఈ బ్రిడ్జి పై మందు తాగుతూ చిందులు వేస్తున్నారు, అదేవిధంగా ముఖ్యంగా కాలేజీలో చదువుతున్న అమ్మాయిలు ఈ బ్రిడ్జి పై ప్రయాణించాలంటే రాత్రులు భయపడి వస్తుంది, ఇప్పటికైనా సంబంధిత అధికారులు, రాజకీయ నాయకులు, చొరవ తీసుకుని సాధ్యమైనంతవరకు త్వరలోనే ఈ బ్రిడ్జి పై విద్యుత్ దీపాలు వెలిగించాలని శ్రీకాకుళం పట్టణ ప్రజలు, ఇటు ఎచ్చర్ల మండల ప్రజలు కోరుకుంటున్నారు.


 

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM