by సూర్య | Sat, Oct 12, 2019, 07:36 PM
న్యూస్ యాంకర్ స్పప్నకు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ముఖ్యమైన పదవి కట్టపెట్టబోతున్నట్టు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. మొదట్లో దూరదర్శన్ ఆపై టీవీ9లో యాంకర్గా,న్యూస్ ప్రెసెంటర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది స్వప్న. దాదాపు టీవీ 9లో పదేళ్లకు పైగా పనిచేసి.. ఆ తర్వాత సాక్షి ఛానెల్లో మారింది. అక్కడ పెద్ద స్థాయికే చేరుకుంది. ఆ తర్వతా సాక్షి నుంచి బయటకు వచ్చినా.. ఆ ఛానెల్కు కన్సల్టెంట్గా పనిచేస్తూనే ఉంది. ప్రస్తుతం 10 టీవీలో పనిచేస్తుంది స్వప్న. అంతేకాదు సొంతంగా వెబ్ చానెల్ను రన్ చేస్తూ జగన్ పట్ల ఉడతా భక్తి చాటుకుంటూనే ఉంది. ఇక స్వప్న తాను చేసే ఇంటర్వ్యూలలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాని ఇరుకున పెడుతూ.. జగన్ కు బాగా పుష్ ఇచ్చే విధంగా ఆమె ఇంటర్వ్యూస్ ఉండేవి. ఏపీలో జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో తన వంతు చిన్న పాత్ర పోషించింది.
Latest News