by సూర్య | Sat, Oct 12, 2019, 06:35 PM
చందర్లపాడు మండలం ముప్పాళ్లలో దారుణం జరిగింది. భార్యను కాపురానికి తీసుకురావడం లేదని తండ్రితో కుమారుడు ఘర్షణకు దిగాడు. ఈ ఘర్షణలో కుమారుడిని తండ్రి హతమార్చాడు. ఘటన వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ళ లో తండ్రీ, కొడుకు ఆదాం, రవిలు నివసిస్తున్నారు. లారీ క్లియర్ గా పనిచేస్తున్న రవి 10 సంవత్సరాల క్రితం వత్సవాయి మండలం ఖమ్మంపాడు గ్రామానికి చెందిన కృష్ణవేణి ని వివాహం చేసుకున్నాడు .గత కొంత కాలం నుంచి భార్యాభర్తలు కొద్దిపాటి గొడవలు జరగడంతో భార్య తన స్వగ్రామానికి వెళ్లిపోయింది. భార్యను తీసుకువచ్చే విషయమై తండ్రీ, కొడుకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన తండ్రి ఆదాం కొడుకు రవిని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Latest News