by సూర్య | Sat, Oct 12, 2019, 04:07 PM
రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ నెల రోజుల్లోనే ఉల్లి ధర చుక్కలను అంటిందన్నారు. వంట నూనెలు, పప్పుల ధరలు పెరిగాయని, ద్రవ్యోల్బణం పెరిగిపోయిందన్నారు. సామాన్యుడి ఆదాయ మార్గాలకు గండికొట్టారన్నారు. ఇన్ఫ్రా రంగం అభివృద్ధితోనే ఉపాధి, ఆదాయం పెరుగుతుందన్నారు. వ్యక్తుల ఆదాయం పెరిగితేనే రాష్ట్రానికి రాబడి వస్తుందన్నారు.
Latest News