by సూర్య | Fri, Oct 11, 2019, 11:04 PM
ఈ మధ్య కాలంలో వైసీపీ పార్టీలోకి భారీగా చేరికలు వైసిపి కార్యకర్తలకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయన్నది వాస్తవం. ఇద్దరు ముగ్గురు మినహాయిస్తే ఇంత కాలం జగన్ని చెడా మడా మీడియాలలో కడిగి పారేసిన వారిని ఆహ్వానిస్తూ పార్టీ కోసమే ఎన్నో కష్టాలను వెరచిన కార్యకర్తలను పక్కన పెట్టడం చూస్తుంటే అసలు జగన్ ఎందుకుఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అర్ధం కావట్లేదన్నది కార్యకర్తల మాట. 151 స్థానాలలో గెలవటమంటే మాటలు కాదని, సంస్ధాగతంగా బలంగా ఉన్న తరుణంలో వలసలు కారణంగా పార్టీలో చిచ్చురేగే ఆస్కారం ఉందని కొందరు చెపుతున్నా రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రయోజనాల కోసమే కులాల వారీగా పార్టీలోకి ఆహ్వానించడంతో వైసీపీ రాజకీయాల్లో మరింత వేడి రాజుకుంది. ఈ క్రమంలోనే జగన్ జూపుడిని చేర్చుకోవడం వెనుక అతని సామాజికవర్గ ఓటు బ్యాంకు వైసీపీకు మరలుతుందని ఓ గుసగుస వినిపిస్తోంది. అయితే జగన్ అభిమానులు మాత్రం జూపూడి లాంటి అవసరాన్ని బట్టి పార్టీలు మారే వ్యక్తులను చేర్చుకుంటే, తమ పార్టీ కూడా విలువలకు తిలోదకాలిచ్చినట్టే అవుతుందనిపిస్తోందని వైసిపి వీరాభిమానులు కొంత మంది సోషల్ మీడియాలో బాహాటంగానే బాధలను వెళ్లగక్కుతూ వ్యాఖ్యలు జోడిస్తున్నారు.
Latest News