by సూర్య | Fri, Oct 11, 2019, 10:55 PM
మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉంటున్న తుమ్మల లోకేశ్వర్ రెడ్డిని కొద్ది రోజుల క్రితం ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా తుమ్మల లోకేశ్వర్ రెడ్డిని అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయనకు సంబంధించిన జీతభత్యాలను ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే లోకేశ్వర్ రెడ్డి జీతభత్యాలను నెలకు మొత్తం 3.82 లక్షలుగా ఖరారు చేసింద్. అయితే ఆయన వేతనంగా 2 లక్షల రూపాయలు మరియు ప్రైవేట్ కార్యదర్శి, వ్యక్తిగత సలహాదారుడు, డ్రైవర్ను నియమించుకునేందుకు 70 వేల రూపాయలు, వాహన నిర్వహణకు 60 వేల రూపాయలు, ఇంటి అద్దెకు 50 వేల రూపాయలు మరియు ఫోన్ బిల్లులకు మరో రెండు వేల రూపాయలుగా పరిగణిస్తూ ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వులలో పేర్కొంది.
Latest News