వైఎస్ఆర్ కంటివెలుగు ప‌థ‌కాన్నిప్రారంభించిన‌ మంత్రి అవంతి

by సూర్య | Fri, Oct 11, 2019, 07:50 PM

రాష్ట్రంలో అర్హత గల ప్రతి పేదవాడి చెంతకు సంక్షేమ పథకాలను తీసుకు వెళ్తున్నట్లు పర్యాటక సాంస్కృతిక యువజన వ్యవహారాల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన గాజువాక ఉన్నత పాఠశాలలో వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి కంటి పరీక్షలు చేసి అవసరమైన కళ్ళజోళ్ళు, మందులు శస్త్ర చికిత్స ఉచితంగా చేస్తారన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు తప్పక కంటి పరీక్షలు చేయించాలి అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చి ఎవరూ ఊహించనంతటి ప్రజారంజక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకుని నవరత్నాలను ప్రకటించారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఉద్యోగాలు కల్పించారని, వాహన మిత్ర పథకంలో ఆటోలు క్యాబ్ డ్రైవర్లకు రూ.10 వేలు ఇచ్చారని కంటి వెలుగులో విద్యార్థులకు దృష్టి లోపాలను సరిదిద్దే కార్యక్రమం చేపట్టారని, 15న రైతు భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వర్గీయ వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రజారోగ్య పథకాలైన 108, 104, ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని గుర్తు చేశారు. అదే బాటలో ముఖ్యమంత్రి అభివృద్ధి సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టారని చెప్పారు.


వీఎంఆర్డీఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ కంటి వెలుగుకు రూ.560 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి ఎప్పుడూ మహిళలు, బాలల గురించి ఆలోచిస్తూ ఉంటారని రుణమాఫీ, అమ్మ ఒడి, కంటి వెలుగు లాంటి పథకాలను రూపొందించార‌న్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశాన్ని ఆశ్చర్యం చెందేలా చేస్తున్నారన్నారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్ట‌ర్ బి.వి.సత్యవతి మాట్లాడుతూ పిల్లలు  టీవీ సెల్ ఫోన్లు ఎక్కువగా చూడటం మూలంగా దృష్టి మాంద్యం వస్తుందన్నారు. దగ్గరగా చూడటం వల్ల మరింత ప్రభావం ఉంటుందని, ఆహారపు అలవాట్లు కూడా ఏ విటమిన్ తగ్గడానికి దోహదపడతాయని తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమంలో ఉచిత శుక్లాల  శస్త్రచికిత్సలు , గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతి మొదలగు కంటి సమస్యలకు ఉచిత చికిత్సలను నిర్వహించడం జరుగుతుందన్నారు. విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి కంటి వెలుగు పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా నేత్రదానం చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంపీ లాడ్స్ తో గాజువాక హైస్కూల్లో డైనింగ్ హాల్లో నిర్మించనున్నట్లు తెలిపారు.

Latest News

 
బోండా ఉమ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు Sat, Apr 20, 2024, 02:03 PM
మాజీ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే అభ్యర్థి Sat, Apr 20, 2024, 02:02 PM
అనకాపల్లి లో అడుగుపెట్టిన సీఎం జగన్ Sat, Apr 20, 2024, 02:01 PM
వర్ల రామయ్య కి నోటీసులు Sat, Apr 20, 2024, 02:00 PM
గులకరాయితో ఎవరైనా హత్య చేస్తారా..? Sat, Apr 20, 2024, 01:57 PM