జుడీషియల్ ప్రివ్యూ పరిశీలనకు సకాలంలో వివరాలు: ఎల్వీ సుబ్రహ్మణ్యం

by సూర్య | Fri, Oct 11, 2019, 07:26 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆంధ్రప్రదేశ్‌ మౌలిక సదుపాయముల (న్యాయపరమైన ముందు సమీక్ష ద్వారా పారదర్శకత) 2019 చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. గురువారం అమరావతి సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, ఎపి జుడీషియల్ ప్రివ్యూ జడ్జి డాక్ట‌ర్ బి.శివశంకర్‌రావుల ఆధ్వర్యంలో ఇంటరాక్షన్ ఆన్ ప్రిరివ్యూ కమీషన్‌పై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ న్యాయపరమైన ముందు సమీక్ష ద్వారా రాష్ట్రంలో మౌలిక సదుపాయముల టెండర్ ప్రక్రియలో పారదర్శకతను తీసుకు వచ్చేందుకు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ చట్టాన్ని అనుసరించి దాని ద్వారా ప్రభుత్వ వనరులను అనుకూలమైన విధంగా వినియోగించు కొనేలా చూడడానికి మరియు అందుకు సంబంధించిన లేదా అనుషంగికమైన విషయములకై దీనిని తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ జుడీషియల్ ప్రీవ్యూ చట్టాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వ ఏజెన్సీ లేదా స్ధానిక అధికారి రూ.100 కోట్లు మ‌రియు అంతకు మించిన మౌలికసదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించి టెండరు ప్రక్రియకు వెళ్ళే ముందు ఆయా పత్రములన్నింటిని న్యాయపరమైన ముందు సమీక్షకు న్యాయమూర్తికి సమర్పించాల్సి ఉంటుందని సిఎస్ స్పష్టం చేశారు. వివిధ పనులు చేపట్టడంలో పాదర్శకతను తీసుకువచ్చేందుకు,ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా కాపాడేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న టెండర్ల ప్రక్రియ వాటికి అనుసరిస్తున్న డిజైన్ ప్రక్రియలను పూర్తిగా అప్ డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే సంబంధిత శాఖలు వద్ద ఎంపేనల్ కాబడిన స్పెషలిస్టులు, కన్సల్టెంట్ల వివరాలను ప్రివ్యూ కమీషన్‌కు అందించాలని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సిఎస్ చెప్పారు. సంబంధిత శాఖలు విధిగా ఆయా నిబంధనలను పాటిస్తూ వివిధ పనులు లేదా ప్రాజెక్టుల టెండర్ ప్రక్రియలు చేపట్టే ముందుకు విధిగా జుడీషియల్ ప్రివ్యూ జడ్జి వారికి పూర్తి వివరాలన్నీ సకాలంలో సమర్పించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వివిధ శాఖల కార్యదర్శులను ఆదేశించారు. సమావేశంలో ఎపి జుడీషీయల్ ప్రివ్యూ కమీషన్ జడ్డి జస్టిస్‌ డా.బి.శివశంకరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ సంస్ధను నెలకొల్పడంలో ముఖ్య ఉద్దేశం ప్రజా ప్రయోజనంలో ప్రభుత్వ వనరులను అనుకూలమైన విధంగా వినియోగించేటట్లు ఆ ప్రకారంగా అనుసరించవలిసిన ప్రకియలలో పారదర్శకతను తీసుకువచ్చే లక్ష్యంతో దీనిని తీసుకురావడం జరిగిందన్నారు. వివిధ శాఖలు ఈ విషయంలో జుడీషియల్ ప్రివ్యూ కమీషన్ కు పూర్తిగా వారి సహాయ సహకారాలను అందించి ప్రజాధనం సద్వియోగం అయ్యేలా కృషి చేయాలని సూచించారు.రూ.100కోట్ల విలువైన టెండర్ ప్రక్రియలన్నిటినీ జుడీషిలయల్ ప్రివ్యూ పరిశీలిస్తుందని తెలిపారు.
ఒకసారి జుడీషియల్ ప్రివ్యూ పరిశీలన చేశాక సంబంధిత టెండర్ ప్రక్రియలో ప్రీబిడ్ నెగోషియేషన్స్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే వివిధ శాఖల కార్యదర్శులు,ముఖ్య కార్యదర్శులు, ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు తదితరులకు వారి వారి శాఖలకు సంబంధించి రూ.100కోట్ల పైబడిన టెండర్ ప్రక్రియలకు సంబంధించిన వివరాలను సమర్పించాల్సిందిగా లేఖలు వ్రాయడం జరిగిందని అన్నారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి కూడా తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, పరిశ్రమలు, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, రవాణా శాఖల ముఖ్య కార్యదర్శిలు రజత్‌భార్గవ, గోపాలకృష్ణ ద్వివేది, యం.టి.కృష్ణబాబు, సాంఘిక సంక్షేమ, మున్సిపల్ పరిపాలన శాఖల కార్యదర్శులు యం.రవిచంద్ర, జె.శ్యామలరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM