by సూర్య | Fri, Oct 11, 2019, 01:16 PM
లింగంపల్లి-విజయవాడ-లింగంపల్లి మార్గంలో నడిచే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వేగాన్ని పెంచి, 15 నిమిషాల ముందుగా గమ్యస్థానాన్ని చేర్చాలని రైల్వే యంత్రాంగం నిర్ణయించింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి లింగంపల్లి-విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ (రైల్ నెంబర్: 12796) లింగంపల్లిలో ఉదయం 4.40గంటలకు (ఇప్పటి మాదిరిగానే) బయల్దేరుతుంది. కాగా ఈ రైలు బేగంపేట్ (4.58/4.59గంటలు), సికింద్రాబాద్ (5.25/5.30), గుంటూరు (9.20/9.22), మంగళగిరి (9.42/9.43)ల మీదుగా విజయవాడకు 10.30గంటలకు చేరుతుంది. వచ్చే జనవరి 20 నుంచి విజయవాడ-లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ (రైల్ నెం:12795) విజయవాడలో సాయంత్రం 5.30గంటలకు (ఇప్పటి మాదిరిగానే) బయల్దేరుతుంది. ఈరైలు మంగళగిరి (5.45/ 5.46), గుంటూరు(6.15/6.17), సికింద్రాబాద్ (10.20/10.25), బేగంపేట్(10.34/10.35)ల మీదుగా రాత్రి 11.15గంటలకు లింగంపల్లి చేరుతుంది.
Latest News