by సూర్య | Sun, Aug 25, 2019, 10:09 AM
భాజపా సీనియర్నేత, మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పార్థీవ దేహానికి తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఇవాళ ఉదయం దిల్లీలోని కైలాష్ నగర్లో జైట్లీ నివాసంలో ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. దిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 12.07 గంటలకు అరుణ్ జైట్లీ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. నివాళులర్పించిన వారిలో ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్, కంభంపాటి రామ్మోహన్రావు, ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.
జైట్లీ పార్థీవ దేహాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తల సందర్శనార్థం కైలాష్ నగర్లోని తన నివాసం నుంచి ఉదయం 11 గంటలకు భాజపా కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. మధ్యాహ్నం 1.30గంటల వరకు అక్కడే ఉంచనున్నారు. అనంతరం అంతిమ యాత్రగా బయల్దేరి మధ్యాహ్నం 2.30 గంటలకు యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్ ఘాట్లో అంతిమ సంస్కారాలు జరుపనున్నట్లు భాజపా నాయకుడు సుధాన్షు మిత్తల్ ఓ ప్రకటనలో తెలిపారు.
Latest News