by సూర్య | Sat, Aug 24, 2019, 08:30 PM
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల భద్రత ఏర్పాట్లపై అన్నమయ్య భవన్లో టీటీడీ భద్రతా విభాగం అధికారులతో పోలీసు యంత్రాంగం సమావేశమైంది. ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో మొదలుకుని గరుడ వాహన సేవ, రథోత్సవం సందర్భంగా భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తిరుమలలో దర్శన టికెట్లు, అద్దె గదులను అధిక ధరలకు విక్రయించి అక్రమాలకు పాల్పడిన 65మంది దళారులను నెలరోజుల్లో అరెస్టు చేసినట్లు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
Latest News