by సూర్య | Sat, Aug 24, 2019, 08:21 PM
రివెర్స్ టెండరింగ్ పై హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుపై తాడేపల్లి నివాసంలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దీనిపై కీలక చర్చలు జరిపారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలగకుండా పోలవరం ప్రాజెక్టు విషయంలో న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఈ భేటీలో చర్చించారు. సమీక్షలో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్య నాధ్ దాస్, అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీ రామ్ పాల్గొన్నారు.