by సూర్య | Sat, Aug 24, 2019, 07:23 PM
విశాఖపట్టణం-విజయవాడ మధ్య నడవనున్న డబుల్ డెక్కర్ ఏసీ రైలు ‘ఉదయ్’ ప్రారంభోత్సవం బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మరణంతో వాయిదా పడింది. రైల్వే శాఖ సహాయమంత్రి సురేశ్ ఈ నెల 26న విశాఖపట్టణంలో ఈ రైలును ప్రారంభించాల్సి ఉంది. ఉదయం 5:45 గంటలకు విశాఖలో విశాఖలో బయలుదేరనున్న రైలు 11:15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. సాయంత్రం 5:30 గంటలకు మళ్లీ విజయవాడలో బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖ చేరుకుంటుంది. వారంలో ఆది, గురువారం తప్ప మిగతా రోజుల్లో నడవనుంది. కాగా, రైలును ఎప్పుడు ప్రారంభించేది త్వరలోనే వెల్లడించనున్నట్టు రైల్వే అధికారులుతెలిపారు. ఉదయ్ ఎక్సప్రెస్ ట్రయల్ రన్ ఇప్పటికే పూర్తయింది. దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
Latest News