డబుల్ డెక్కర్ ‘ఉదయ్’ ప్రారంభోత్సవం వాయిదా

by సూర్య | Sat, Aug 24, 2019, 07:23 PM

విశాఖపట్టణం-విజయవాడ మధ్య నడవనున్న డబుల్ డెక్కర్ ఏసీ రైలు ‘ఉదయ్’ ప్రారంభోత్సవం బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మరణంతో వాయిదా పడింది. రైల్వే శాఖ సహాయమంత్రి సురేశ్ ఈ నెల 26న విశాఖపట్టణంలో ఈ రైలును ప్రారంభించాల్సి ఉంది. ఉదయం 5:45 గంటలకు విశాఖలో విశాఖలో బయలుదేరనున్న రైలు 11:15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. సాయంత్రం 5:30 గంటలకు మళ్లీ విజయవాడలో బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖ చేరుకుంటుంది. వారంలో ఆది, గురువారం తప్ప మిగతా రోజుల్లో నడవనుంది. కాగా, రైలును ఎప్పుడు ప్రారంభించేది త్వరలోనే వెల్లడించనున్నట్టు రైల్వే అధికారులుతెలిపారు. ఉదయ్ ఎక్సప్రెస్ ట్రయల్ రన్ ఇప్పటికే పూర్తయింది. దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి స్టేషన్‌లలో ఈ రైలు ఆగుతుంది.

Latest News

 
టిప్పర్ ఢీకొని యువకుడు మృతి Fri, Mar 29, 2024, 12:57 PM
గుత్తి ఆటో యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉచితంగా అల్పాహారం పంపిణి Fri, Mar 29, 2024, 12:54 PM
శివాలయంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి Fri, Mar 29, 2024, 12:53 PM
కర్ణాటక మద్యం పట్టివేత Fri, Mar 29, 2024, 12:52 PM
కాంగ్రెస్ గూటికి సొసైటీ డైరెక్టర్ ఉపేందర్ Fri, Mar 29, 2024, 12:52 PM